తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈయనకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
మహేష్ బాబు అందానికి అభినయానికి అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలు అభిమానులుగా మారిపోయారని చెప్పాలి.ఇక ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సైతం మహేష్ బాబు సరసన ఒక్క సినిమాలో అయినా నటించే అవకాశం వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు.
అలాంటి అందం డిసిప్లిన్ కలిగి ఉన్నటువంటి మహేష్ బాబు గురించి తాజాగా నటి జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దివంగత నటి శ్రీదేవి దివంగత నటుడు కృష్ణ కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి.ఇలా కృష్ణ గారితో శ్రీదేవి బ్లాక్ బస్టర్ అందుకోగా మహేష్ బాబుతో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎప్పుడు నటిస్తారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇదివరకే జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా జాన్వి కపూర్ మహేష్ బాబు గురించి తన అందం గురించి పొగడ్తల వర్షం కురిపించారు.మహేష్ బాబు అందం చూస్తే కసిగా తినేయాలనేంత క్రష్ ఉందని తెలిపారు.
సాధారణంగా ఎవరికైనా వయసు పైబడే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ సార్ కి మాత్రం అందం పెరుగుతుంది.ఈ విషయం నాకు ఎప్పటికీ ఆశ్చర్యకరంగానే అనిపిస్తుందని తెలిపారు.
మహేష్ సార్ వైపు చూస్తుంటే తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తన ఫేస్ మొత్తం బ్లాంక్ అవుతుందని ఈ సందర్భంగా మహేష్ గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.