కెనడాలో భారతీయ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సర్రేలో హైస్కూల్ పార్కింగ్ స్థలంలో జరిగిన గొడవలో కత్తిపోట్లకు గురైన బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
మృతుడిని మెహక్ప్రీత్ సేథీ (18)గా గుర్తించారు.ఇతను న్యూటన్ ప్రాంతంలోని 12600 66 అవెన్యూలో వున్న తమనావిస్ సెకండరీ స్కూల్ వెలుపల దాడికి గురై, తీవ్రగాయాలతో మంగళవారం ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయినట్లు వాంకోవర్ సన్ నివేదించింది.
కత్తిదాడికి సంబంధించి అత్యవసర విభాగానికి అనేక కాల్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.తక్షణమే బాధితుడిని ఆసుపత్రికి తరలించామని పోలీస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) సార్జంట్ తిమోతీ పియరోటీ వాంకోవర్ సన్తో మాట్లాడుతూ.సేథికి మరో 17 ఏళ్ల బాలుడికి మధ్య జరిగిన గొడవ కారణంగా కత్తిపోట్ల ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు.
ఈ సమయంలో అనుమానితుడు, బాధితుడు ఒకరికొకరు తెలుసునని పోలీసులు పేర్కొన్నారు.
సాక్షులు గుర్తించిన తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తమనావిస్ సెకండరీ స్కూల్ తాత్కాలిక ప్రన్సిపాల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.సేథి ఈ పాఠశాల కమ్యూనిటీలో సభ్యుడు కాదు.
ఘటన జరిగిన సమయంలో పాఠశాల విద్యార్ధులంతా భవనం లోపల వుండిపోయారని, బయటి నుంచి తలుపులు లాక్ చేశారు.ఈ దారుణం చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో చాలా మంది విద్యార్ధులు వున్నారని, అంతా క్షేమమేనని పోలీసులు చెప్పారు.
గత వారం బ్రాంప్టన్లోని కాజిల్బ్రూక్ సెకండరీ స్కూల్ వెలుపల 18 ఏళ్ల విద్యార్ధిపై కాల్పులు జరిగిన సంఘటన తర్వాత ఈ హత్య జరగడంతో పాఠశాలల్లో పిల్లల రక్షణపై చర్చ జరుగుతోంది.