టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సిట్ అధికారులు పలువురికి నోటీసులు అందించారు.
ఈ నేపథ్యంలో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.అడ్వకేట్ ప్రతాప్ తో పాటు నంద కుమార్ భార్య చిత్రలేఖలు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.41 ఏ సీఆర్పీసీ నోటీసులను సవాల్ చేస్తూ.తమకు సంబంధం లేని కేసులో నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే 41 ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణకు హజరు కావాలని హైకోర్టు తెలిపింది.చిత్రలేఖను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
కాగా న్యాయవాది ప్రతాప్ , చిత్రలేఖలు రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు.