janhvi kapoor karan johar : నన్ను ఆ నిర్మాత వల్లే తిడుతున్నారు.. కరణ్ జోహార్ పై జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె అయిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట దడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.

 Janhvi Kapoor People Hate Me Because Karan Johar , Janhvi Kapoor , Karan Johar ,-TeluguStop.com

శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.కాగా ఈ ముద్దుగుమ్మ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.

ఇకపోతే జాన్వి కపూర్ నటించిన ధడక్ సినిమా మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సైరాట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ధడక్ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

దడక్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించారు.ఆ తర్వాత కరణ్ జోహార్ నిర్మించిన పలు సినిమాలలో కూడా నటించి మెప్పించింది జాన్వీ కపూర్.

అయితే అదే తనకు విమర్శలను తెచ్చిపెట్టింది అంటుంది జాన్వీకపూర్.తనను నిర్మాత కరణ్ జోహార్ లాంచ్ చేయడం వల్ల తనపై ఇంత విద్వేశం చిమ్ముతున్నారు అంటోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

గొప్ప నిర్మాణ సంస్థ అయిన ధర్మా ప్రొడక్షన్స్ హౌస్ నన్ను ఇండస్ట్రీలో లాంచ్ చేసింది.

Telugu Bollywood, Dhadak, Janhvi Kapoor, Karan Johar, Sridevi-Movie

కానీ ఇదే నాపై ట్రోలింగ్స్ కి కారణం అనుకుంటున్నా.ఐకానిక్ ధర్మ ప్రొడక్షన్స్ నన్ను ద్వేషించేందుకు ఒక మార్గాన్ని కల్పించింది.దీనివల్ల నేను ఒత్తిడికి లోనవుతాను, కానీ ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపపడను.

ఎందుకంటే కరణ్ జోహార్ అతనికి సంబంధించిన ధర్మా ప్రొడక్షన్స్ హౌస్ సృజనాత్మక నిర్ణయాల గురించి మీకు తెలియదు.వాళ్ల బ్యానర్ లో పని చేసినందుకు నేను అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను.

అన్నింటికీ మంచి కరణ్ జోహార్ వంటి నిర్మాత నుంచి నాకు ప్రేమ, విశ్వాసం, మార్గదర్శకత్వం లభించింది అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.ఇకపోతే జాన్వీ కపూర్ సినిమా విషయానికి వస్తే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మిలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జాన్వీ కపూర్ బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకు ముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube