ఒకప్పుడు అంతా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కే ప్రాధాన్యత ఇచ్చే వారు.వ్యక్తిగత వాహనాలు అందరికీ ఉండేవి కావు.
అయితే ఇటీవల కాలంలో అంతా ఎక్కువగా వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ తర్వాత వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది.
ఈ క్రమంలో ఎక్కువ మొత్తం వెచ్చించి కొత్త వాహనాలను కొనకుండా, చాలా మంది సెకండ్ హ్యాండ్ వాహనాలను కొంటున్నారు.బైక్లతో పాటు కార్లను కూడా ఎక్కువ మంది కొనుగోళ్లు చేస్తున్నారు.
బైక్లు కొత్తవి అయితే దాదాపు రూ.లక్ష నుంచి రూ.1.4 లక్షలు ఖర్చు పెట్టాలి.మిడిల్ క్లాస్ వారు కార్లు కొనాలనుకుంటే కనీసం రూ.5 లక్షల నుంచి దాదాపు రూ.15 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది.అయితే ప్రీ ఓన్డ్(సెకండ్ హ్యాండ్) అయితే సగం ధరకే వాటిని సొంతం చేసుకోవచ్చు.
అందుకే సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి.
సెకండ్ హ్యాండ్ బైక్లు మరియు కార్ల మార్కెట్లో గత సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి.
ఈ అమ్మకాల గణాంకాల పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.ఒకటి మహమ్మారి సమయంలో ప్రజా రవాణాను నివారించే ప్రయత్నం.
రెండవది కొత్త వాహనాలను కొనుగోలు చేయడంలో ఆర్థిక పరిమితులు.ఇటీవల ఓ సర్వేలో 46% మంది సాధారణ ప్రజలు బడ్జెట్ కారణంగా కొత్త వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.50% మంది ప్రీ-ఓన్డ్ వాహనాలకు అనుకూలంగా ఉన్నారు.ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ జూన్ 2019లో 616,526 యూనిట్ల మోటార్సైకిళ్లు మరియు స్కూటర్ల నుండి జూన్ 2020 నాటికి 450,744 యూనిట్లకు పడిపోయింది.
అమ్మకాలు పడిపోవడంతో దిగ్గజం వాహన తయారీ సంస్థ గణనీయమైన నష్టాన్ని చవిచూసింది.
ఈ గణాంకాలు సెకండ్ హ్యాండ్ బైక్ల విక్రయం భారత ఆర్థిక వ్యవస్థలో ఆటో రంగానికి స్థిరమైన వృద్ధికి సంకేతంగా మారుతున్నాయి.ముఖ్యంగా ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ప్రీ ఓన్డ్ కార్లపై మక్కువ చూపుతున్నారు.సగం ధరకే కార్లు వస్తుండడంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు.
ఢిల్లీ వంటి రాష్ట్రాలలో డీజిల్ వాహనాలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.దీంతో అక్కడి ప్రజలు డీజిల్ కార్లను ఎక్కువగా విక్రయిస్తున్నారు.
దీంతో వాటిని కొనుగోలు చేసి, దేశంలో వివిధ ప్రీ ఓన్డ్ గ్యారేజ్లు తక్కువ ధరకే మధ్య తరగతి ప్రజలకు వాహనాలను చేరవేస్తున్నారు.