సీఎం జగన్ తో భేటీ అయిన మంత్రి రోజా..!!

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.ఇటీవల నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల మధ్య వర్గ పోరు పెరిగిపోయింది.

 Minister Roja Met Cm Jagan Minister Roja, Cm Jagan, Rythu Bharosa, Chakra Pani R-TeluguStop.com

తన వర్గాన్ని పక్కనపెట్టి చక్రపాణి రెడ్డి వర్గం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుపై సీఎం జగన్ కి మంత్రి రోజా ఫిర్యాదు చేయడం జరిగింది అంట.కావాలని నియోజకవర్గంలో తనని బలహీనపరిచే దిశగా పార్టీకి చెందిన నాయకులు వ్యవహరిస్తున్నారని.దీనివల్ల పార్టీ బలహీనపడే అవకాశం ఉందని జగన్ కి రోజా ఫిర్యాదు చేశారట.

ఈనెల 16వ తారీకు నగరి నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలను అసమతి నేతగా ఉన్న చక్రపాణి రెడ్డి వర్గం ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మంత్రి రోజాకి ఆహ్వానం పంపించకుండా కార్యక్రమం కంప్లీట్ చేసేశారు.ఈ ఘటనపై అప్పట్లో పార్టీ కార్యకర్తలతో రోజా మాట్లాడుతూ ఈ రీతిలో రాజకీయం చేయాలంటే కష్టమే అన్న ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలో చక్రపాణి రెడ్డి వర్గం తనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలో వ్యవహరిస్తున్న తీరును అధినేత జగన్ దృష్టికి రోజా తీసుకెళ్లడం జరిగిందట.ఈ భేటీలో రోజాతో పాటు ఆమె భర్త సెల్వమని కూడా పాల్గొన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube