యాదాద్రి జిల్లా:కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని పీసీసీ మెంబర్ చల్లమల కృష్ణారెడ్డి,నారాయణపురం మండల ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.నారాయణపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో శనివారం గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశము నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాల గురికాకుండా ఏ పార్టీలోకి వెళ్ళకూడదని సూచించారు.మునుగోడు ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కష్టపడి పనిచేసి గెలిపించాలని కోరారు.
వార్డు మెంబర్లను, సర్పంచులను,గ్రామస్థాయి,మండల స్థాయి నాయకులను అంగట్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని,ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైనదని అన్నారు.మునుగోడు గడ్డ అంటేనే చైతన్యవంతమైన ప్రాంతమని ఎంతోమంది వీరులు ఈ ప్రాంతం నుండి ప్రజల కోసం అమరత్వం పొందారని తెలిపారు.
ఈ ప్రాంతంలో డబ్బు సంస్కృతి మంచి సంప్రదాయం కాదన్నారు.ఈ సందర్భంగా కంకణాలగూడెం,శేరిగూడెం గ్రామాల నుండి 9 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం మురళీధర్ రెడ్డి,రాసమల్ల యాదయ్య,మహమ్మద్ అక్బర్ అలీ,జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్, కరంటోత్ ప్రజ్ఞా నాయక్ తదితరులు పాల్గొన్నారు.