కాంగ్రెస్ శ్రేణులు ప్రలోభాలకు గురికావద్దు:చల్లమల

యాదాద్రి జిల్లా:కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని పీసీసీ మెంబర్ చల్లమల కృష్ణారెడ్డి,నారాయణపురం మండల ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.నారాయణపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో శనివారం గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశము నిర్వహించారు.

 Don't Be Tempted By Congress Ranks: Challamala-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాల గురికాకుండా ఏ పార్టీలోకి వెళ్ళకూడదని సూచించారు.మునుగోడు ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కష్టపడి పనిచేసి గెలిపించాలని కోరారు.

వార్డు మెంబర్లను, సర్పంచులను,గ్రామస్థాయి,మండల స్థాయి నాయకులను అంగట్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని,ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైనదని అన్నారు.మునుగోడు గడ్డ అంటేనే చైతన్యవంతమైన ప్రాంతమని ఎంతోమంది వీరులు ఈ ప్రాంతం నుండి ప్రజల కోసం అమరత్వం పొందారని తెలిపారు.

ఈ ప్రాంతంలో డబ్బు సంస్కృతి మంచి సంప్రదాయం కాదన్నారు.ఈ సందర్భంగా కంకణాలగూడెం,శేరిగూడెం గ్రామాల నుండి 9 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం మురళీధర్ రెడ్డి,రాసమల్ల యాదయ్య,మహమ్మద్ అక్బర్ అలీ,జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్, కరంటోత్ ప్రజ్ఞా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube