తెలంగాణలో బీజేపీ ఇంచార్జ్ లకు షాక్ తగిలినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఇంచార్జ్ లతో సునీల్ బన్సల్ సమావేశం జరిగింది.
అసెంబ్లీ ఇంచార్జ్ లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదని బన్సల్ తెలిపారు.దీంతో అసెంబ్లీ ఇంచార్జ్ లు ఒక్కసారిగా ఖంగుతిన్నట్లు తెలుస్తోంది.
ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు యెండల, యెన్నం శ్రీనివాస రెడ్డి, ధర్మారావు, స్వామిగౌడ్, విఠల్, బండా కార్తీకరెడ్డి ఉన్నారని సమాచారం.అయితే బన్సల్ ప్రకటనతో తమను అసెంబ్లీ ఇంచార్జ్ లుగా తొలగించాలని పలువురు నేతలు కోరుతున్నారు.
ఈ క్రమంలో వారికి సర్దిచెప్పిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ కనీసం ఆరు నెలల పాటు ఇంచార్జ్ లుగా పని చేయాలని సూచించారు.ఆరు నెలల తర్వాత సొంత నియోజకవర్గాల్లో పని చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారని తెలుస్తోంది.