మావోయిస్టు పార్టీపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మావోయిస్ట్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆయన తెలిపారు.
టాప్ లీడర్లు దళాన్ని లీడ్ చేసే పరిస్థితుల్లో లేరని చెప్పారు.మావోయిస్ట్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తోందని డీజీపీ వెల్లడించారు.
పార్టీ బాగుందనే మావోయిస్టులు చెప్పుకుంటున్నారన్నారు.గ్రౌండ్ లెవల్ లో పార్టీలో సఖ్యత లేదని చెప్పారు.
మావోయిస్ట్ అగ్రనేతలంతా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ఆయన ముగ్గురు సెంట్రల్ కమిటీ సభ్యులు అనారోగ్యంతో మరణించారని పేర్కొన్నారు.మరో ఆరుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు లొంగిపోయారని తెలిపారు.
అనంతరం మావోలు లొంగిపోతే ప్రభుత్వ సహకారంతో చికిత్స అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.