మహారాష్ట్రలో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది.సతారాలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది.
సుమారు నాలుగు గంటల పాటు ఇంట్లోనే ఇష్టారాజ్యంగా తిరిగింది.ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత విగ్రహం నిమజ్జనానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడింది.
అనంతరం ఇంటికి తిరిగివచ్చిన కుటుంబ సభ్యులు చిరుతను చూసి తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు.సమాచారం అందుకున్న జూ అధికారులు నాలుగు గంటలకు పైగా శ్రమించి ఎట్టకేలకు చిరుతను పట్టుకున్నారు.