తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఛాలెంజ్ చేశారు.మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ తో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ కు నమ్మకం ఉంటే మునుగోడులో బీఆర్ఎస్ తో పోటీ చేయాలని అన్నారు.దీనిలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పై పోటీకి దిగాలని డిమాండ్ చేశారు.
మునుగోడులో బీజేపీనే గెలుపు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కేసీఆర్ అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.