టీడీపీ కీలక నేత చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ మంత్రి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ కీలక నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అమరావతి రైతుల ఉద్యమం పేరిట జరుగుతున్న పాదయాత్ర విషయంలో చింతమనేని రెచ్చగొట్టే వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.

 Ycp Minister Serious Comments On Tdp Leader Chintamaneni Prabhakar Details, Ycp-TeluguStop.com

అయినా కానీ తాను చాలా సంయమనంతో ఉంటున్నట్లు తెలిపారు.తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై అమరావతి రైతుల కంటే ఎక్కువ మందితో ర్యాలీ నిర్వహించాలన్న చింతమనేని సవాల్ కి మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ విధంగా ప్రతిస్పందించారు.

కాగా రెండవ దఫా అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్రలో చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలుపుతూ పలు మార్లు పాల్గొంటూ వస్తున్నారు. అమరావతి రైతులు తలపెట్టిన ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకంగా.జరుగుతున్న ఈ పాదయాత్రకి వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి.

అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని.టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా పార్టీల నేతలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube