తెలుగుదేశం పార్టీ కీలక నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అమరావతి రైతుల ఉద్యమం పేరిట జరుగుతున్న పాదయాత్ర విషయంలో చింతమనేని రెచ్చగొట్టే వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.
అయినా కానీ తాను చాలా సంయమనంతో ఉంటున్నట్లు తెలిపారు.తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై అమరావతి రైతుల కంటే ఎక్కువ మందితో ర్యాలీ నిర్వహించాలన్న చింతమనేని సవాల్ కి మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ విధంగా ప్రతిస్పందించారు.
కాగా రెండవ దఫా అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్రలో చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలుపుతూ పలు మార్లు పాల్గొంటూ వస్తున్నారు. అమరావతి రైతులు తలపెట్టిన ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకంగా.జరుగుతున్న ఈ పాదయాత్రకి వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి.
అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని.టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా పార్టీల నేతలు కోరుతున్నారు.