మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో గులాబీ దళం పోరుకు సిద్ధమైంది.గెలుపే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది అధిష్టానం.
దీనిలో భాగంగా 14 మంది మంత్రులకు మునుగోడు బాధ్యతలు అప్పగించారు.అదేవిధంగా మునుగోడు ఎన్నికకు 86 మంది ఇంఛార్జ్ లను టీఆర్ఎస్ ప్రకటించింది.
ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు కలిపి ఒక ఇంఛార్జ్ నియామకం కాగా.ఇంఛార్జ్ లు రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పని చేయనున్నారు.
ఇతర ప్రాంతాల్లో ఒక్కో ఎంపీటీసీ పరిధిలో ఒకరికి బాధ్యతలు అప్పగించారు.దీనిలో భాగంగా గట్టుప్పల్ -1 ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ గా మంత్రి కేటీఆర్, మర్రిగూడ ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ గా మంత్రి హరీశ్ రావు, మునుగోడు-1 ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ గా మంత్రి జగదీశ్ రెడ్డి, చండూరు 2,3 వార్డులకు ఇంఛార్జ్ గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులను నియమించారు.