తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు అయ్యారు.జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ సందర్బంగా ప్రగతిభవన్ కు కీలక నేతలు అందరూ వచ్చినా కేసీఆర్ కుమార్తె కవిత హాజరు కాలేదు.
దీంతో ఆమె గైర్హాజరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.అయితే కవిత ఈ కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఆమె సొంత నిర్ణయమా లేక పార్టీ అధిష్టానం ఆదేశాల అన్నది ప్రశ్నార్థకంగా మారింది.