టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి సందడి చేశారు.ఇలా ఒకవైపు హీరోయిన్ గా మరోవైపు విలన్ గా నటించి ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో తల్లి పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ఇకపోతే ప్రస్తుతం రమ్యకృష్ణ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ ఐకానిక్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్ మాస్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.
ఒక లేడీ కంటెస్టెంట్ నా అల్లుడు సినిమాలోని సయ్యా సయ్యారే అనే పాటను పర్ఫామెన్స్ చేశారు.ఇక ఈ పాటకి సదరు కంటెస్టెంట్ డాన్స్ చేస్తుండగా రమ్యకృష్ణ ఎంతో ఎక్సైట్ అయ్యారు.
ఈ పర్ఫామెన్స్ అనంతరం రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను నా అల్లుడు సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఈ పాటను చేశామని ఈమె గుర్తు చేసుకున్నారు.ఇక తన కెరియర్ లో ఈ పాట ఎంతో స్పెషల్ అని ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఈ పాట వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టారు.ఈ పాటకు తాను డాన్స్ చేసిన సమయంలో తాను నాలుగు నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నానని షాకింగ్ న్యూస్ చెప్పారు.ఇలా నాలుగు నెలలు ప్రెగ్నెంట్ అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో డాన్స్ చేయాల్సి వచ్చిందని, అందుకే ఈ సాంగ్ ఎప్పటికీ నాకు స్పెషల్ అంటూ ఈమె చెప్పడంతో ఈ మాటలు విన్నటువంటి శ్రీముఖి శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.