తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సమావేశం అయ్యారు.కాసేపటి క్రితం ప్రగతిభవన్ కు కుమారస్వామి చేరుకున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు.దీనిలో మాజీ మంత్రి రేవన్న, జేడీఎస్ సీనియర్లు పాల్గొన్నారు.
కాగా, టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం అనంతరం కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశమై జాతీయ పార్టీ తీర్మానానికి ఆమోదం తెలపనున్నారు.అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ పార్టీ పేరును ప్రకటించనున్నారు.