ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.రాష్ట్రంలో అన్యాక్రాంతం అవుతున్న దసపల్లా భూములను కాపాడాలని కోరారు.
దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.దీని వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వందల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం రక్షించాలని సోము వీర్రాజు లేఖలో కోరారు.