మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించడంతో కొంతమంది లూసిఫర్, గాడ్ ఫాదర్ ట్రైలర్స్ ను పోలుస్తూ చిరంజీవిని ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రోల్స్ గురించి చిరంజీవి స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఎవరితో పోల్చినా నేను నిలబడగలనని చిరంజీవి చెప్పుకొచ్చారు.
రీమేక్ సినిమాలో ఎందుకు నటించారనే ప్రశ్నకు చిరంజీవి ఈ జవాబు ఇచ్చారు.
రీమేక్ సినిమా అంటే ఎందుకు తక్కువ భావనను కలిగి ఉన్నారని చిరంజీవి ప్రశ్నించారు.
నిజం చెప్పాలంటే రీమేక్ చేయడమే ఛాలెంజ్ అని ఆయన అన్నారు.రీమేక్ సినిమాలో నటిస్తే ఒరిజినల్ రేంజ్ లో నిలబడగలమా లేదా అనే సందేహం ఉంటుందని చిరంజీవి కామెంట్లు చేశారు.
మరొకరితో నన్ను పోల్చినా పరవాలేదని నేను నిలబడగలనని నా చరిత్రను చూసుకోండని చిరంజీవి వెల్లడించడం గమనార్హం.
నేను నటించిన రీమేక్ సినిమాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయని చిరంజీవి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ గాడ్ ఫాదర్ సినిమా కథలో ఎన్నో మార్పులు చేశానని అన్నారు.
గాడ్ ఫాదర్ సెకండాఫ్ లో చాలా మార్పులు చేశానని మోహన్ రాజా వెల్లడించారు. గాడ్ ఫాదర్ మూవీ కొత్తగా ఉంటుందని మోహన్ రాజా పేర్కొన్నారు.
గాడ్ ఫాదర్ సినిమాను లూసిఫర్ సినిమాతో పోల్చినా మా బృందం భయపడదని మోహన్ రాజా చెప్పుకొచ్చారు.
మోహన్ రాజా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలొ వైరల్ అవుతున్నాయి.గాడ్ ఫాదర్ సినిమాకు 90 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఆచార్య సినిమా రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరగకపోవడంతో అభిమానులు ఫీలవుతున్నారు.