రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది.సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు వాగులో గల్లంతయ్యారు.
శంషాబాద్ మండలం నానాజీపూర్ లో చోటు చేసుకుంది.పండగ నేపథ్యంలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు వాగులో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.దీనిలో భాగంగా ఒకరి మృతదేహాన్ని బయటకు తీసిన అధికారులు.
మరొకరి కోసం గాలిస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.