ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ జట్టులో టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ వైద్య బృందం తొలగించింది.
నిపుణులతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది.జస్ప్రీత్ బుమ్రా, వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3-మ్యాచ్ల టీ20 సిరీస్కు మొదట్లో దూరమయ్యాడు.
బీసీసీఐ త్వరలో టీ20 ప్రపంచకప్లో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులో చోటు కల్పించనుందని అంతా భావించారు.అయినా గాయం తీవ్రత కారణంగా బుమ్రా ఆడేది లేనిదీ అభిమానుల్లో ఆందోళన పెంచుతూ వచ్చింది.
చివరికి వెన్ను గాయం కారణంగా జట్టుకు బుమ్రా దూరం అయ్యాడని బీసీసీఐ ప్రకటించింది.
బుమ్రా స్థానంలో టీ20 వరల్డ్ కప్కు మహ్మద్ షమీ, దీపక్ చాహర్లలో ఒకరు ప్రధాన జట్టులోకి రానున్నారు.
స్టాండ్ బై లిస్ట్లో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పేరు ఉంటుందని భావిస్తున్నారు.బుమ్రా భారత బౌలింగ్ దళంలో అత్యంత ముఖ్యమైన బౌలర్.అతడి పేస్కు తిరుగు ఉండదు.బుమ్రా జట్టులో ఉంటే మిగిలిన బౌలర్లకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది.
ప్రస్తుతం భారత్కు పేస్ బౌలర్లు ఉన్నా, బుమ్రా ఉంటే అతడి అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడేది.భారత్ మూడు వారాల్లో ప్రపంచ కప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది.
బుమ్రా లేకపోవడంతో భారత్ విజయావకాశాలపై కొంచెం ప్రభావం పడుతుందనేది వాస్తవం.
అయితే జట్టులోనూ, రిజర్వ్ బెంచ్లోనూ నాణ్యమైన బౌలర్లు ఉన్నారు.అయితే అనుభవ లేమి ఒక్కటే సమస్య.అయితే భువనేశ్వర్, షమీ వంటి వంటి వారు మిగిలిన వారికి మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరం ఉంది.
బుమ్రా డెత్ బౌలింగ్ నైపుణ్యాన్ని భారత్ కోల్పోయింది.అతను జనవరి 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి భారతదేశం తరపున 30 టెస్టులు, 72 వన్డేలు, 60 టీ20లు ఆడాడు.
దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి మ్యాచ్ మంగళవారం స్వదేశంలో జరగనుంది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మెల్బోర్న్లో అక్టోబరు 23న టీమ్ ఇండియా వరల్డ్ కప్ క్యాంపెయిన్ ప్రారంభమవుతుంది.