హైదరాబాదులో ఉగ్రకుట్ర భగ్నం కేసులో దర్యాప్తు వేగవంతం

హైదరాబాదులో ఉగ్రకుట్ర భగ్నం కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.దసరా పండుగ నేపథ్యంలో భారీ జనసందోహం ఉన్న ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ప్లాన్ అరికట్టిన విషయం తెలిసిందే.

 Investigation In Hyderabad Terror Conspiracy Case To Be Speeded Up-TeluguStop.com

ఈ క్రమంలో సిట్ దర్యాప్తులో అధికారులు కీలక సమాచారం సేకరించారు.ఉగ్ర కుట్రను భగ్నం చేసి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో అబ్దుల్ జాహెద్, మాజా హసన్, సమీ ఉద్దీన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.మరోవైపు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ముగ్గురు నిందితులను ఉంచారు.

అంతేకాకుండా ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అధికారులు కీలకంగా భావిస్తున్నారు.దేశ వ్యాప్తంగా జరిగిన పేలుళ్లతో వీరికి లింకులు ఉన్నాయని, బిలాల్ ను వాడిన నెట్ వర్క్ నే జాహెద్ వాడాడని గుర్తించారు.

ఎఫ్ఐఆర్ లో ఏడుగురు పేర్లు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube