హైదరాబాదులో ఉగ్రకుట్ర భగ్నం కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.దసరా పండుగ నేపథ్యంలో భారీ జనసందోహం ఉన్న ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ప్లాన్ అరికట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సిట్ దర్యాప్తులో అధికారులు కీలక సమాచారం సేకరించారు.ఉగ్ర కుట్రను భగ్నం చేసి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో అబ్దుల్ జాహెద్, మాజా హసన్, సమీ ఉద్దీన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.మరోవైపు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ముగ్గురు నిందితులను ఉంచారు.
అంతేకాకుండా ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అధికారులు కీలకంగా భావిస్తున్నారు.దేశ వ్యాప్తంగా జరిగిన పేలుళ్లతో వీరికి లింకులు ఉన్నాయని, బిలాల్ ను వాడిన నెట్ వర్క్ నే జాహెద్ వాడాడని గుర్తించారు.
ఎఫ్ఐఆర్ లో ఏడుగురు పేర్లు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు.