యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హిందీ సినిమా ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఇదే సమయంలో నేడు సాయంత్రం అయోధ్య లో జరగబోతున్న భారీ ఈవెంట్ లో ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయించబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా అయోధ్య చేరుకున్నారని, ప్రభాస్ కూడా చేరుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.అది కొద్ది మంది మీడియా వారికి మరియు సినీ ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం దక్కినట్లుగా కూడా సమాచారం అందుతుంది.
టీజర్ విడుదల కార్యక్రమం కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవ్వబోతున్న నేపథ్యం లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారట.అయోధ్య లో జరగబోతున్న ఈవెంట్ కి సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తికరంగా మారాయి.
కొన్ని వీడియోలు సినిమా యొక్క టీజర్ విడుదల కార్యక్రమం ఇక్కడే జరిగేది అంటూ తెగ ట్రెండ్ అవుతున్నాయి.ఆ విషయం పక్కన పెడితే అయోధ్య ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ చిత్ర యూనిట్ సభ్యులంతా కలిసి అక్టోబర్ 5వ తారీఖున ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం అందుతుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు ఇక నుండి ప్రతి కార్యక్రమంను కూడా అత్యంత వైభవంగా నిర్వహించి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా చేయాలని తద్వారా ఎక్కువ శాతం మందికి సినిమాను రీచ్ అయ్యేలా ప్లాన్ చేయాలని భావిస్తున్నారట.
అందుకే అయోధ్యలో ఈవెంట్ జరిగిన రెండు రోజుల్లోనే మళ్లీ ఢిల్లీలో ఈవెంట్ కి హాజరు అవ్వబోతున్నారు.రాంలీల మైదానంలో ఆదిపురుష్ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేయబోతున్న నేపథ్యం లో భారీ ఎత్తున ప్రేక్షకులు మరియు అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.దసరా ఉత్సవాల్లో భాగంగా రాంలీల మైదానంలో ప్రతి సంవత్సరం కూడా వేడుకలు జరగడం పరిపాటి.
అయితే ఈసారి ప్రభాస్ హాజరు కాబోతున్న నేపథ్యంలో మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి.