ప్రముఖ్య పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తులు రోడ్డెక్కారు.శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేవు.
దీంతో భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.భక్తులకు కనీసం బస్సు సౌకర్యం కూడా లేదంటూ రోడ్డుపై బైటాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అధికారులు భక్తుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు.మరోవైపు సెలవు రోజు ఆదివారం కావడంతో భక్తులు యాదాద్రి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండ పైకి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.