ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కాన్పూర్ జిల్లా ఘటంపూర్ లో యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు.మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.