జమ్మూకశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.యెడిపోరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు.
బారాముల్లాలో ఆర్మీ నియామక ర్యాలీపై దాడికి ఉగ్రవాదుల కుట్ర పన్నారు.ఈ క్రమంలో భద్రతా బలగాలు రంగంలోకి దిగారు.
ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు జవాన్ల ప్రయత్నించారు.ఈ నేపథ్యంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ప్రతిఘటించిన జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో.ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.
అనంతరం వీరి వద్ద నుంచి రెండు రైఫిళ్లు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.