రోజా ఒక హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రియాల్టీ షోలకు జడ్జిగా, ఒక ఫైర్ బ్రాండ్ గా, పొలిటిషన్ గా ఇలా రకరకాల పాత్రలు పోషిస్తుంది.నిజజీవితంలో తల్లిగా, భార్యగా కూడా ఆమె తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తుంది.1972లో చిత్తూరులోని తిరుపతిలో నాగరాజు రెడ్డి, లలిత దంపతులకు శ్రీలత రెడ్డిగా జన్మించిన రోజా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుని తన సత్తాను చాటింది.రాజేంద్రప్రసాద్ సరసన ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రోజా.
అక్కడి నుంచి అవన్నీ నీటి వరకు వెని తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వంటి స్టార్ హీరోలకు దీటుగా నటించి అనేక సినిమాల్లో మంచి పాత్రలను సైతం తగ్గించుకుంది.
ప్రస్తుతం రాజకీయాల వల్ల కాస్త సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఆమె మార్క్ మాత్రం తెలుగు సినిమా లోనే కాకుండా తమిళ్, మలయాళం చిత్రాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.హీరోయిన్ గానీ కాకుండా ఆ ప్రొడ్యూసర్ గా కూడా మారి సినిమాలో నిర్మించింది.
ఒకానొక దశలో సినిమాల వల్ల పాతాళంలోకి పడిపోయిన రోోజా ఆర్థిక పరిస్థితి మళ్లీ రియాలిటీ షోలతో ఆకాశాన్నింటింది.తమిళ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తమిళ డైరెక్టర్ అయినా సెల్వమని నీ ప్రేమించింది.
కొన్నాళ్ల పాటు వీరి ప్రేమ బాగానే సాగింది ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం రోజా కి ఇద్దరు పిల్లలు.
ఇక రోజా తండ్రి నాగరాజు రెడ్డి కి ఎస్పీ బాలసుబ్రమణ్యం మంచి స్నేహితులనే విషయం మాత్రం ఎవ్వరికి తెలియదు.వీరిద్దరూ కలిసి పియుసి తిరుపతిలో చదువుకున్నారు.చిన్నతనంలో తన తండ్రి తో పాటు బాలుని చూడడానికి రోజా కూడా వెళ్లేదట.రెండు జడలు వేసుకుని సన్నగా, పీలగా ఉన్న రోజని చూసి బుగ్గలు గిళ్ళేవాడట బాలు.
ఇక రోజా పెరిగి పెద్దయిన తర్వాత సినిమాల్లో నటిస్తుంది అని ఆ రోజు ఆయన ఊహించలేదు.ఆ తర్వాత రోజా నటించిన అనేక సినిమాల్లో బాలు ఎన్నో పాటలు పాడడం కోసం విశేషం.