రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం అనంతరం పార్టీ అధిష్టానం కీలక చర్యలకు రంగం సిద్ధం చేసింది.ఈ క్రమంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలకు కేసి వేణుగోపాల్ అడ్వైజరీ జారీ చేశారు.
పార్టీ అంతర్గత అంశాలు, ఇతర నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.పార్టీ అంతర్గత విషయాలు, ఇతర నేతలకు వ్యతిరేకంగా ఏ స్థాయి నేతలైన బహిరంగ ప్రకటనలు మానుకోవాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకొంటాం అని స్పష్టం చేశారు.