విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో దుర్గగుడి వద్ద భక్తులు ఆందోళనకు దిగారు.
అంతరాలయ దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.రూ.3 వేల టికెట్ తీసుకున్నాఅనుమతించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.ఆలయ అధికారుల తీరును నిరసిస్తూ ఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
దీనిపై స్పందించిన ఆలయ ఈవో భ్రమరాంబ అంతరాలయ ప్రవేశం లేదని తేల్చి చెప్పారు.అయితే, వీఐపీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.