తెలంగాణలో లంపీ స్కిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.ఏజెన్సీలో పశువులకు ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలంలో రెండు లంపీ కేసులు నమోదు అయ్యాయి.వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బలు వస్తున్నాయి.
దీంతో వెటర్నరీ అధికారులు అప్రమత్తం అయ్యారు.మరోవైపు వైరస్ కలకలం రేపడంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.