తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు.నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా డోనార్ గెస్ట్ హౌస్ ను కూడా ఆయన ప్రారంభించారు.రూ.22 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరకామణి భవనాన్ని నిర్మించింది టీటీడీ.ఇకపై ఈ భవనంలో భక్తుల మధ్యనే శ్రీవారి కానుకలు లెక్కించనున్నారు.