పోర్టుల నిర్మాణంలో ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది.ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అవార్డును కైవసం చేసుకుంది.
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోర్టులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఏపీని టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డుకు ఎంపిక చేసింది.
ఢిల్లీలో ఈ అవార్డును ఏపీ తరఫున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మారిటైం డిప్యూటీ సీఈఓ రవీంద్ర నాథ్లు అందుకున్నారు.