ఏపీలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేస్తున్న ఇద్దరు నేతలపై వేటు వేసింది.
కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన సాయినాథ్ శర్మ, మైదుకూరు నియోజకవర్గానికి చెందిన వెంకట సుబ్బారెడ్డిలను పదవుల నుంచి తొలగించారు.ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ ఇంఛార్జ్ లతో విభేదించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.దీనిపై విచారణ చేపట్టిన హైకమాండ్ ఆరోపణలు నిజమేనని తేల్చింది.
దీంతో ఇద్దరిని పదవుల నుంచి తొలగించారని సమాచారం.