జబర్దస్త్ షో గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఈ షో వల్ల ఎంతోమంది కమెడియన్లు ఆర్థికంగా స్థిరపడ్డారు.జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో మిమిక్రీ మూర్తి ఒకరు.
అయితే అనారోగ్య సమస్యల వల్ల ఈ ప్రముఖ కమెడియన్ మృతి చెందారు.మిమిక్రీ ఆర్టిస్ఱ్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న మిమిక్రీ మూర్తి జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు.
పాంక్రియాస్ క్యాన్సర్ తో గత కొంతకాలంగా బాధ పడుతున్న ఈ కమెడియన్ క్యాన్సర్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించడంతో మృతి చెందారని తెలుస్తోంది.మిమిక్రీ మూర్తి మరణ వార్త తెలిసి జబర్దస్త్ కమెడియన్లు శోకసంద్రంలో మునిగిపోయారు.
జబర్దస్త్ మాజీ కమెడియన్లలో ఒకరైన అప్పారావు మిమిక్రీ మూర్తి మరణ వార్త నిజమేనని వైరల్ అవుతున్న వార్త గురించి స్పష్టతనిచ్చారు.
ఆర్థిక సమస్యల వల్ల మిమిక్రీ మూర్తికి చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం అందుతోంది.
కొంతమంది స్నేహితులు ఆయనకు ఆర్థిక సహాయం చేశారని 16 లక్షల రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేసినా క్యాన్సర్ నుంచి కోలుకోలేక మిమిక్రీ మూర్తి మృతి చెందారని సమాచారం.క్యాన్సర్ కు వాడే మందులు సైతం మిమిక్రీ మూర్తి హెల్త్ పై దుష్ప్రభావాలను చూపించాయని సమాచారం.
చాలా సంవత్సరాల క్రితమే మిమిక్రీ మూర్తికి క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది.మిమిక్రీ మూర్తి ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో పలువురు సినీ ప్రముఖులు మరణించగా తక్కువ సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మిమిక్రీ మూర్తి కుటుంబానికి సినీ ప్రముఖులు ఎవరైనా ఆర్థికంగా అండగా నిలిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.