కరోనా బారినపడిన చిన్నారులు, కౌమార దశలో ఉన్న పిల్లలకు టైప్-1 డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం వెలుగు చూసింది.13 దేశాల్లో 18 ఏళ్లలోపు వయసున్న 10 లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనం అనంతరం పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.కరోనా సోకిన 6 నెలలోపు చాలా మంది చిన్నారులు మధుమేహం బారిన పడుతున్నట్లు గుర్తించారు.
కరోనా బారిన పడని వారితో పోలిస్తే, పడిన వారిలో ముప్పు 73% అధికంగా ఉన్నట్లు తేలింది.కానీ, దీనికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.టైప్-1 డయాబెటిస్ ను ఆటో ఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు తెలిపారు.