ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు.మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పర్యటన చేయనున్నారు.
దీనిలో భాగంగా ముందుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కేటీఆర్ పరామర్శించనున్నారు.ఇటీవలే జోగు రామన్న తల్లి భోజమ్మ మరణించారు.
అనంతరం ఆదిలాబాద్ లో ఐటీ సేవలను ప్రారంభించనున్నారు.అక్కడ నుంచి నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రులు వెళ్లనున్నారు.
విద్యార్థులతో సమావేశం అనంతరం వారితో కలిసి భోజనం చేయనున్నారు.విద్యార్థుల సమస్యలను మంత్రులు స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.