ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన జోడీలలో మహాలక్ష్మి రవీందర్ జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.సీరియల్ నటిగా వీజేగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న మహాలక్ష్మి ప్రముఖ నిర్మాత రవీందర్ ను కొన్ని వారాల క్రితం పెళ్లి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడి మహాలక్ష్మి రవీందర్ పెళ్లి చేసుకోగా కొంతమంది ఈ జోడీపై నెగిటివ్ కామెంట్లు చేశారు.
అటు మహాలక్ష్మికి ఇటు రవీందర్ కు ఈ పెళ్లి రెండో పెళ్లి కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
కొంతమంది డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్ ను పెళ్లి చేసుకుందని కామెంట్లు చేయడం గమనార్హం.తిరుపతిలో మహాలక్ష్మి రవీందర్ పెళ్లి జరగగా ఈ జోడీ మధ్య పెళ్లి సమయంలో కొన్ని విషయాలకు సంబంధించి షరతులు కూడా పెట్టుకున్నారని సమాచారం అందుతోంది.
అయితే మహాలక్ష్మికి రవీందర్ ఎంత బంగారం పెట్టాడనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఒకటిన్నర కిలోల బంగారాన్ని మహాలక్ష్మికి రవీందర్ ఇచ్చారని తెలుస్తోంది.రవీందర్ విద్యుం వారై కతిరు అనే సినిమాలో నటించగా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది.మహాలక్ష్మి నటించిన సీరియళ్లలో మెజారిటీ సీరియళ్లు హిట్ అయ్యాయి.
మహాలక్ష్మికి తమిళనాడు రాష్ట్రంలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.మహాలక్ష్మి రవీందర్ జోడీ కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహాలక్ష్మి రాబోయే రోజుల్లో సీరియళ్లు, సినిమాలలో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.మహాలక్ష్మికి ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడు.అయితే రవీందర్ ను పెళ్లి చేసుకున్న మహాలక్ష్మి మరో బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.