విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో పెద్దపులి కలకలం రేపుతోంది.శాతంవలసలో సంచరిస్తున్న పులి.
మేకల మందపై దాడికి పాల్పడింది.ఈ దాడిలో మూడు మేకలు మృతిచెందగా.
కాపరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వారి అరుపులతో సమీపంలో కొండల్లోకి వెళ్లింది పులి.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పాదమూద్రలు గుర్తించే పనిలో పడ్డారు.పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.