ఈమధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం అనేది జనాలపై బాగా కనబడుతోంది.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింతలూ విశేషాలు సోషల్ మీడియా ఆధారంగానే తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో అనేకరకాల వీడియోలు నెటిజన్ల మనసులను దోచుకుంటున్నాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, ఇంకొన్ని ఆశ్చర్యంగా, మరికొన్ని బాధాకరంగా… ఇంకొన్ని అద్భుతంగా, చాలా భయానకంగా ఉంటున్నాయి.
ఇక తాజాగా వైరల్ అవుతోన్న ఒక వీడియో మాత్రం చాలా భీకరంగా వుంది అనడంలో అతిశయోక్తి లేదు.
బేసిగ్గా జనాలు ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి, చీకటిగా మారితే కాస్త భయానికి లోనవుతారు.
అలాంటిది ఒక ప్రళయంలా, మరేమీ కనిపించకుండా మబ్బులు ఆకాశం నుండి భూమిని కమ్మేస్తే.పరిస్థితి ఏంటి? ఇది వూహించుకోవడానికే కష్టం అనుకుంటే, దాన్ని నిజంగా చూసినవారికి గుండె జారిపోతుందేమో కదా.తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.అవును.
మబ్బులు సముద్రపు అలల మాదిరిగా, తుపాను మాదిరిగా దూసుకొచ్చాయి.ఆకాశం నుంచి భూమి ఉపరితలాన్ని సైతం కప్పేస్తూ సముద్రపు రాకసి అలల మాదిరిగా దూసుకొచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ వైరల్ వీడియో ఒకసారి చూస్తే, ఓ కొండ ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది.ఒక ప్రళయం ముంచుకొస్తున్నట్లుగా, సునామీ సందర్భంలో ఎగసిపడే అలల మాదిరిగా ఉంది దృశ్యం.మబ్బుల భీకర దృశ్యాలను కొందరు తమ ఫోన్ కెమెరాల్లో బందించి.సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.ఇంతటి భయానకమైన మబ్బులను తామెన్నడూ చూడలేదని, ప్రకృతి భయపెడితే ఎవరూ తట్టుకోలేరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.