చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు.దీనిలో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ధిదారులకు మూడో విడత కింద నగదు విడుదల చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది.అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.