పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఇప్పటికే ఈ సినిమా పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉంది.
కానీ కరోనా ఇతరత్రా కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మళ్ళీ డేట్లు ఇవ్వడంతో షూటింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ బస్సు యాత్ర ఏర్పాట్లు కూడా ముమ్మరం గా సాగుతున్న నేపథ్యం లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఈ సమయం లోనే దసరా కు ప్రారంభం అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఆలస్యం గా ప్రారంభించే అవకాశం ఉందంటూ జన సేన అధికారికం గా ప్రకటించింది.
కొత్త యాత్ర ప్రారంభ తేదీ నీ అతి త్వరలోనే ప్రకటించ బోతున్నట్లుగా జనసేన నాయకుడు అధికారికం గా ప్రకటించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ ఉన్న సినిమా లకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.నవంబర్ లేదా డిసెంబర్ నుండి జన సేన బస్సు యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఈ లోపు పవన్ కళ్యాణ్ సాధ్యమై నన్ని ఎక్కువ రోజులు షూటింగ్లో పాల్గొని సినిమాలను పూర్తి చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ఇప్పటికే రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.హరిహర వీరమల్లు సినిమా మధ్య లో ఉంది.కనుక పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభిస్తే కనీసం 6 నెలల వరకు ఆయన షూటింగ్ లకి దూరంగా ఉండే అవకాశం ఉంది అంటూ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.