కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.గత కొద్ది రోజులుగా కేరళలో యాత్రకు మంచి స్పందన వస్తుంది.
మరోవైపు ఈ పాదయాత్ర వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నియంత్రించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.భారత్ జోడో యాత్ర రోడ్డుకు ఒకేవైపు ఉండేలా రెగ్యూలేట్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రెండో వైపు ట్రాఫిక్ వెళ్లేలా చూడాలన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర కారణంగా ఇటీవల జాతీయ రహదారిని సుమారు నాలుగు గంటల పాటు మూసివేశారని, దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పిటిషనర్ తెలిపారు.
కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను ఈ యాత్ర ఉల్లంఘిస్తోందన్నారు.అయితే ఈ పిటిషన్ పై న్యాయస్థానం రేపు విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.