కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో చిరుత పులి మృతి చెందింది.సదాశివనగర్ మండలంలోని బైపాస్ అటవీ ప్రాంతం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.
మృతిచెందిన చిరుత వయసు ఏడాది నుంచి ఏడాదిన్నర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.