మంత్రి అంబటిపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సెటైర్లు వేశారు.వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది.
ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.డయాఫ్రమ్ వాల్ ఇప్పటివరకు ఎందుకు సరి చేయలేదని నిలదీశారు.
హైడల్ పవర్ ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ పవర్ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి తీసుకున్న నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల అనైతిక చర్యల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు.