నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాలలో భారీవర్షాలు కురుస్తున్నాయి.బుధవారం భారీ,గురువారం అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
ఉత్తర,దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితలద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి ఏపీ మీదుగా కర్ణాటక వరకూ విస్తరించింది.బుధవారం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.
దీని ప్రభావంతో శుక్రవారానికి అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా.వీటి వల్ల తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తాయని తెలుస్తోంది.