కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్రపై వైసీపీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి స్పందించారు.ఈ పాదయాత్ర ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆరోపించారు.
నెహ్రూ కుటుంబం ఎన్నికల్లో గెలవలేకపోయిందంటే అందుకు కారణం భారత్ విచ్ఛిన్నమైందని కాదన్నారు.భారత్ ఎప్పుడూ విచ్ఛిన్నం కాలేదు, ఇప్పుడూ విచ్ఛిన్నంగా లేదు, ఇకముందూ విచ్ఛిన్నం కాబోదు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాదయాత్ర పేరును పార్టీ మృత్యువుకు ముందు తుదిశ్వాస అని మార్చుకుంటే బాగుంటుంది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.