జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.“నువ్వు సీఎం అయితే దిగి వచ్చావా.కొమ్ములు ఉంటాయా.?, ఎంతకాలం జగన్ కి భయపడతాం.నా కుటుంబంలో వ్యక్తిని కూడా జగన్ చేతులు కట్టుకునేలా చేశారు.
చిరంజీవితో కూడా జగన్ దండం పెట్టించుకున్నారు.చేతులు కట్టుకుని తన ముందు నిలబడేలా చేశారు.
కోట్లాదిమందికి తెలిసిన వ్యక్తికే ఇలా అయితే.సామాన్యుల పరిస్థితి ఏంటి అని ధ్వజమెత్తారు.దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.అప్పట్లో సినిమా టికెట్ ధరల విషయంలో చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ టాప్ హీరోలు మరియు కొంతమంది దర్శకులు సీఎం వైఎస్ జగన్ ని కలిశారు.
ఆ సమయంలో చిరంజీవి చేతుల జోడించి ఇండస్ట్రీ తరఫున ముఖ్యమంత్రి ముందు తమ ఇబ్బందులను తెలియజేయడం జరిగింది.ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ తాజాగా సీఎం వైఎస్ సొంత జిల్లా కడప పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.