టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు రోజు రోజుకూ అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది.విజయ్ కు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈయన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ నిర్మాతలు పోటీ పడుతున్నారు.
దీంతో విజయ్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా మరొక వారం రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
మొదటి సారి విజయ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.
ఇక రిలీజ్ కూడా దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలతో పాటు.
ఫ్యాన్ డమ్ టూర్ కూడా స్టార్ట్ చేసి దేశం మొత్తం చుట్టేస్తున్నారు.
అలాగే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగష్టు 20వ తేదీన గుంటూరు మోతడక లోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించ నున్నారు.ఈ వేడుక సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ కానుంది.
ఇక ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.