హైదరాబాద్ లో కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.గంటకు పైగా సెక్రటేరియట్ ప్రాంగణంలోనే సమయాన్ని గడిపారు.
అనంతరం పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.