వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జీఎస్ఎల్వీ-మార్క్ 3 ద్వారా గగన్ యాన్ ప్రయోగాత్మక ప్రయోగం చేపట్టబోతున్నామని షార్ డైరెక్టర్ రాజరాజన్ అన్నారు.గగన్ యాన్ మానవ రహిత ప్రయోగాలు జరిపిన తర్వాతనే పూర్తి ప్రయోగం ఉంటుందని తెలిపారు.అదేవిధంగా వ్యోమగాములని సురక్షితంగా తీసుకురావాలని ఇస్రో ప్రయత్నిస్తుందన్నారున.ఎస్ఎల్వీ-డీ1 సెన్సార్ సమస్య కారణంగానే నిర్దిష్ట కక్ష్యలోకి ఉపగ్రహాలని చేరవేయలేకపోయిందని వెల్లడించారు.2023 ఫిబ్రవరి – జూలై మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్ -3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని పేర్కొన్న ఆయన.నాలుగు నెలల్లో నాలుగు ప్రయోగాలే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు