స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో.దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది.
రేపు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
పది వేల మంద పోలీసులతో భద్రత ఏర్పాటు చేసిన అధికారులు.ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో షార్ప్ షూటర్స్, ఎస్ఎన్జీ స్నైపర్లతో పాటు ఎలైట్ కమాండోలు భారీగా మోహరించారు.4 కిలో మీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తించి, నియంత్రించగలిగే యాంటీ డ్రోన్ వ్యవస్థను డీఆర్డీవో ఏర్పాటు చేసింది.ఎర్రకోట సమీపంలోని ఎనిమిది మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని అధికారులు తెలిపారు.
ఈ ఆంక్షలు అర్ధరాత్రి 12 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.